హైదరాబాద్, వెలుగు : వచ్చేనెల 3,4 తేదీల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ(ఎంపీసీ స్ర్టీమ్) తదితర కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తామని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వాకాటి కరుణ ప్రకటించారు. సెప్టెంబర్ 1న స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు.
ఇంటర్నల్ స్లైడింగ్ కు సంబంధించిన గైడ్లైన్స్ను శుక్రవారం విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా, మొత్తం 18,815 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కాలేజీల వారీగా ఖాళీల వివరాలను https://tseamcet.nic.in వెబ్ సైట్లో పెట్టినట్టు చెప్పారు.