
హైదరాబాద్, వెలుగు: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ సంస్థ ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 3, 5, 6, 11 ర్యాంకులు సాధించిందని శ్రీచైతన్య విద్యాసంస్థల సీఈవో & అకడమిక్ డైరెక్టర్ సుష్మ వెల్లడించారు. ఓపెన్ కేటగిరీలో టాప్ 10 లోపు, టాప్ 100 లోపు అత్యధిక ఆలిండియా ర్యాంకులు శ్రీచైతన్యవేని ఓ ప్రకటనలో తెలిపారు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్న వంగల అజయ్ రెడ్డి తమ స్టూడెంటేనని చెప్పారు. టాప్ ర్యాంకుల్లోనూ, టోటల్ ర్యాంకుల్లోనూ శ్రీచైతన్యకు తిరుగులేదన్నారు. డీజీ రుత్విక్ సాయి ఆలిండియా ఫస్ట్ ర్యాంక్.. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో మాజిద్ హుస్సేన్ 3వ ర్యాంక్, ఉజ్జ్వల్ కేసరి 5, అక్షత్ కుమార్ చౌరాసియా 6, అర్నవ్ నిగమ్ 11, దేవ్ దత్త మజ్హీ 16, రుత్విక్ సాయి 18, వంగల అజయ్ రెడ్డి19 వ ర్యాంక్ సాదించారని తెలిపారు.
ఓపెన్ కేటగిరీలో టాప్ 10లోపు 3 ర్యాంకులతోపాటు, 20లోపు 7 ర్యాంకులు, 50లోపు 19 ర్యాంకులు, 100 లోపు 29 ర్యాంకులు శ్రీచైతన్యవేనని వివరించారు. ఈసారి కూడా ఐఐటీల్లో మొదటి వరుసతో పాటు మొత్తం సీట్లలోనూ అత్యధిక శాతం శ్రీచైతన్య విద్యార్థులవేనని సుష్మ వెల్లడించారు. దేశంలో నిష్ణాతులైన టాప్ ఫ్యాకల్టీతో ఆఫ్లైన్, ఆన్ లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణ, మైక్రోషెడ్యూల్స్, ఆలిండియా టెస్ట్ సీరిస్ ప్రోగ్రాములతోనే ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. అందువల్లే ఐఐటీ ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు శ్రీచైతన్యనే కోరుకుంటున్నారని చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని సుష్మ అభినందించారు. జేఈఈ, ఎన్ఈఈటీ టాప్ నుంచి 100 పర్సంటైల్ ర్యాంక్ హెూల్డర్లను, ఆలిండియా టాప్ ర్యాంకర్లను అందిస్తూ శ్రీచైతన్య నాలుగు దశాబ్దాల్లో ఆసియాలోనే అతిపెద్ద విద్యా సంస్థగా అవతరించింది.