నా తప్పుల వల్లే ఇదంతా..

నా తప్పుల వల్లే ఇదంతా..
  • అంగీకరించిన శ్రీలంక ప్రెసిడెంట్ గోటబయ

కొలంబో: దేశంలో ఆర్థిక సంక్షోభానికి తాము గతంలో తీసుకున్న నిర్ణయాలు కూడా కారణమని శ్రీలంక ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స అంగీకరించారు. గడిచిన ఎన్నో ఏండ్లలో తాము చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు దేశం దారుణమైన పరిస్థితిలో ఉందన్నారు. ప్రస్తుతం వాటిని చక్కదిద్దేందుకు తమ కుటుంబం శాయశక్తులా ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ మధ్యే ఏర్పడిన కొత్త కేబినెట్ మంత్రులతో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. ‘నిత్యావసర వస్తువుల కోసం జనాలు పడిగాపులు పడుతూ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. వాళ్లకు కోపం రావడంలో తప్పేమీలేదు. కానీ, గడిచిన రెండున్నరేండ్లలో కరోనా మహమ్మారి, అప్పుల భారం వంటి సమస్యలు ఎదుర్కొన్నం. వాటికితోడు మేం చేసిన తప్పులూ ఉన్నయ్’ అని రాజపక్స అన్నారు. ఇపుడు వాటిని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరముందని, ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలని కేబినెట్ మంత్రులకు ఆయన సూచించారు.