శ్రీ కృష్ణ జ్యుయెలర్స్ ఎండీ ప్రదీప్ అరెస్ట్

శ్రీ కృష్ణ జ్యుయెలర్స్ ఎండీ ప్రదీప్ అరెస్ట్

ప్రముఖ నగల వ్యాపారి శ్రీ కృష్ణ జ్యువెలర్స్ ఎండీ ప్రదీప్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ప్రదీప్ కుమార్ తో పాటు అతని కుమారుడు సాయి చరణ్ ను అరెస్ట్ చేశారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ -DRI అధికారులు.

విదేశాల నుంచి అక్రమంగా బంగారం కొనుగోలు చేశారని… దీనికి టాక్స్ ఎగ్గొట్టారని ప్రదీప్ కుమార్, ఆయన కుమారుడిపై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు.. దేశంలోని పలు నగరాల్లో 35 సంస్థలను నిర్వహిస్తున్నారు ప్రదీప్ కుమార్. పలు రాష్ట్రాల్లో బంగారం బిజినెస్ చేస్తున్నారు. ఐతే… అక్రమంగా బంగారం కొనుగోలు చేసి రవాణా చేయడం.. పన్నులు కట్టకపోవడం లాంటి కారణాలతో ప్రదీప్ కుమార్, ఆయన కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.