బ్రిస్టల్: శ్రీలంక-బంగ్లాదేశ్ టీమ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణంగా నలిచింది. మంగళవారం మధ్యాహ్నం గం.3.00ని.లకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కల్గించింది. పిచ్ను, ఔట్ ఫీల్డ్ను కవర్లతో కప్పి ఉంచారు. వర్షం తగ్గితే ఓవర్లకు కుదించి మ్యాచ్ ను స్టార్ట్ చేద్దామనుకున్నారు. అయితే వర్షం కంటిన్యూగా రావడంతో.. మ్యాచ్ టాస్ వేయకుండానే క్యాన్సిల్ చేశారు అంపైర్లు. రెండు టీమ్స్ కు చెరో పాయింట్ ఇచ్చారు.
ఈ మ్యాచ్ లో గెలిచే టీమ్ టోర్నీలో కాస్త మెరుగైన స్థానంలో నిలిచేది. ప్రస్తుతం శ్రీలంక నాలుగు మ్యాచులతో నాలుగు పాయింట్లు సాధించింది. బంగ్లాకు 4 మ్యాచులతో 3 పాయింట్లు కైవసం చేసుకుంది. టోర్నీలో ఇంకా ఈ రెండు జట్లకు మిగిలినవి ఐదు మ్యాచులే. అవీ కఠినమైన జట్లతో ఉండనున్నాయి. ప్రస్తుత మ్యాచ్ రద్దు కావడంతో టోర్నీ చివర్లో పరిస్థితులు ఈ జట్లకు సంక్లిష్టంగా మారొచ్చు.
వర్షం కారణంగా శ్రీలంక-పాకిస్తాన్ మ్యాచ్తో పాటు దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ మ్యాచ్ సైతం రద్దయిన సంగతి తెలిసిందే. వర్షాలు ఇలాగే పడితే పలు జట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
Unfortunately, Bangladesh's #CWC19 fixture against Sri Lanka has been called off due to the inclement weather.
The points have been shared. pic.twitter.com/GHqKa0Hm48
— Cricket World Cup (@cricketworldcup) June 11, 2019