మంత్రి హత్యకు కుట్ర కేసు నిందితుల రిమాండ్ పొడగింపు

మంత్రి హత్యకు కుట్ర కేసు నిందితుల రిమాండ్ పొడగింపు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల రిమాండ్ను మేడ్చల్ మున్సిఫ్ కోర్టు పొడగించింది. నిందితులకు మరో 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మంత్రి హత్యకు కుట్ర పన్నారన్న అభియోగాలపై రాఘవేందర్ రాజు, మున్నూరు రవి, అమరేందర్, మధుసూదన్, రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. మున్నూరు రవి, రాఘవేందర్ రాజులను మరో ఐదు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్ను మేడ్చల్ కోర్టు కొట్టి వేసింది. మరోవైపు నిందితుల బెయిల్ పిటీషన్పై మేడ్చల్ కోర్టు గురువారం విచారణ జరపనుంది. 

మరిన్ని వార్తల కోసం..

గౌరవం ఇవ్వని చోట ఉండలేను

ఢిల్లీలో బిజీబిజీగా యోగి ఆదిత్యనాథ్