శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3 కోట్ల 87లక్షలు

శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3 కోట్ల 87లక్షలు

శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల  ఉభయ ఆలయాలు,పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు.చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 87 లక్షల 52 వేల 761 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు ఈ ఆదాయాన్ని గత 15 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. 

హుండి లెక్కింపులో నగదుతో పాటు 263 గ్రాముల 900 మిల్లీ గ్రాముల బంగారం అలానే వెండి 9 కేజీల 700 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు 44 యుఎస్ఏ డాలర్లు,1 ఒమన్ రియాల్,101 ఖత్తార్ రియాల్, 1.75 కువైట్ దినార్,5 యుఏఈ దిర్హమ్స్ 30 సౌది అరేబియా రియాల్స్,20 కెనడా డాలర్లు మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.