తిరుమలలో కన్నుల పండువగా శ్రీవారి గరుడ సేవ

తిరుమలలో కన్నుల పండువగా శ్రీవారి గరుడ సేవ

బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి గరుడసేవ ఘనంగా జరుగుతోంది. గరుడసేవకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలోని నాలుగు మాఢవీధులు ఇప్పటికే భక్తులతో నిండిపోయి. మరోవైపు గ్యాలరీలలోకి భక్తులను అనుమతించకపోవడంతో భక్తులు రోడ్లపై కిక్కిరిసిపోయారు. వర్షం కురుస్తున్నా తడుస్తూనే స్వామి వారి సేవకోసం ఎదురు చూస్తున్నారు. లేపాక్షి, నందకం, మ్యూజియం దగ్గర గ్యాలరీలలోకి అనుమతించాలంటూ భక్తులు ఆలయాధికారులను కోరుతున్నారు.