నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ జరిగింది. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య స్వామివారి సేనాపతి విష్వక్సేను డు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పరిశీలించారు. సోమవారం సాయత్రం 5.23 నుండి 6 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సమక్షంలో వేదగానాలు, మంగళవాయిద్యాల మధ్య అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. సాయంత్రం రాష్ట్ర సర్కారు తరఫున సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు.