
హైదరాబాద్, వెలుగు: రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న 61వ నేషనల్ లెవెల్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున దండు శ్రీవిజ్ఞారెడ్డి ఎంపికైంది. సీబీఐటీ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన శ్రీవిజ్ఞా సీనియర్ విభాగంలో పోటీపడనుంది. డిసెంబర్ 15 నుంచి 25 వరకు చెన్నైలో నేషనల్ టోర్నీ జరగనుంది. భువనగిరి, హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె ఒక గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ గెలిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. నేషనల్స్కు ఎంపికైన శ్రీవిజ్ఞాకు కోచ్ యాదయ్య అభినందనలు తెలిపాడు.