హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా ఇద్దరు ఐఏఎస్ అధికారులు జి.సృజన, వినయ్ కృష్ణారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో వీరు చార్జ్ తీసుకున్నారు. వినయ్ కృష్ణారెడ్డి మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్లను మానిటరింగ్ చేయనున్నారు.
జి.సృజన కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జోన్ల కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. బాధ్యతలు స్వీకరించే ముందు ఇద్దరు అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను కలిశారు. ఇకపై వీరు తమకు అప్పగించిన జోన్లపై రెగ్యులర్గా పర్యవేక్షణ చేపట్టనున్నారు.
