
న్యూఢిల్లీ: ఎస్బీఐ 2024–-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రభుత్వానికి రూ.8,076.84 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు బ్యాంకు చైర్మన్ శెట్టి డివిడెండ్ చెక్కును అందజేశారు. ఎస్బీఐ 2024–-25 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.15.90 డివిడెండ్ను ప్రకటించింది.
బ్యాంకు గత సంవత్సరం ప్రభుత్వానికి రూ.6,959.29 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఇది 2024-–25లో రికార్డు నికర లాభాన్ని ఆర్జించింది.