
- మరో సారి కేబినెట్ తీర్మానం
- గవర్నర్ కు పంపాలని నిర్ణయం
- మహిళలకు వడ్డీలేని రుణం, 2,500 ఆర్థిక సాయం
- మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ
- జీవో 317, ఉద్యోగ నియామకాలపైనా చర్చ
- ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం
హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమిర్ అలీఖాన్ పేర్లను రాష్ట్ర కేబినెట్ మరో మారు ఫైనల్ చేసింది. ఈ మేరకు తీర్మానం కాపీని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు పంపాలని నిర్ణయించింది. గతంలో వీళ్లిద్దరినీ ఎమ్మెల్సీలు గా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరిద్దరి ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తుది తీర్పును వెల్లడించిన హైకోర్టు గవర్నర్ నిర్ణయాన్ని తప్పపట్టింది. దీంతో తాజాగా కేబినెట్ వీరిద్దరి పేర్లనూ ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ ఇవాళ తీర్మానం చేసి మరో మారు గవర్నర్ కు పంపింది.