- 1+1కు తగ్గించిన రాష్ట్ర సర్కారు
- వచ్చిన సిబ్బందిని వెనక్కు పంపిన రేవంత్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్రేవంత్రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రతను మరింత తగ్గించింది. గతంలో 4+4 ఉన్న భద్రతను 2+2కి తగ్గించగా.. ఇప్పుడు దానిని 1+1కి కుదించింది. దీనిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ ఇద్దరిని కూడా రేవంత్ వెనక్కు పంపించేసినట్టు సమాచారం. గతంలో భద్రతను తగ్గించడంపై రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కోర్టులో ఉండగానే.. ప్రభుత్వం ఉన్న భద్రతనూ తగ్గించడం చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల పేర్లను రెడ్ డైరీలో రాసిపెడుతున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి గుడ్డలూడదీస్తామని రేవంత్ ఇటీవల కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానిపైనా ప్రస్తుతం వివాదం నడుస్తున్నది. పోలీసు అధికారుల సంఘం ఆయన వ్యాఖ్యలపై మండిపడింది. ఈ క్రమంలోనే రేవంత్కు భద్రత కల్పించేందుకు వారు వెళ్లలేదన్న చర్చ కూడా నడుస్తున్నది.