రేవంత్​కు భద్రత తగ్గింపు .. 1+1కు తగ్గించిన రాష్ట్ర సర్కారు

రేవంత్​కు భద్రత తగ్గింపు .. 1+1కు తగ్గించిన రాష్ట్ర సర్కారు
  • 1+1కు తగ్గించిన రాష్ట్ర సర్కారు
  • వచ్చిన సిబ్బందిని వెనక్కు పంపిన రేవంత్​

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్​రేవంత్రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రతను మరింత తగ్గించింది. గతంలో 4+4 ఉన్న భద్రతను 2+2కి తగ్గించగా.. ఇప్పుడు దానిని 1+1కి కుదించింది. దీనిపై రేవంత్​ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ ఇద్దరిని కూడా రేవంత్​ వెనక్కు పంపించేసినట్టు సమాచారం. గతంలో భద్రతను తగ్గించడంపై రేవంత్​ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కోర్టులో ఉండగానే.. ప్రభుత్వం ఉన్న భద్రతనూ తగ్గించడం చర్చనీయాంశమైంది.

బీఆర్​ఎస్​కు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల పేర్లను రెడ్​ డైరీలో రాసిపెడుతున్నామని, కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక వారి గుడ్డలూడదీస్తామని రేవంత్​ ఇటీవల కామెంట్​ చేసిన సంగతి తెలిసిందే. దానిపైనా ప్రస్తుతం వివాదం నడుస్తున్నది. పోలీసు అధికారుల సంఘం ఆయన వ్యాఖ్యలపై మండిపడింది. ఈ క్రమంలోనే రేవంత్​కు భద్రత కల్పించేందుకు వారు వెళ్లలేదన్న చర్చ కూడా నడుస్తున్నది.