గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్. నాగర్ కర్నూల్ జిల్లాలోని చెంచుపెంటల్లో ఆమె పర్యటించారు.అప్పాపూర్ లోని చెంచుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులంతా ఆరోగ్యంతో ఉండాలని.. మంచి పోషక ఆహారం తీసుకోవాలని సూచించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న నల్లమల చెంచుల ఆరోగ్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు గవర్నర్. పైలట్ ప్రాజెక్ట్ కింద అప్పాపూర్ , భౌరాపూర్ పెంటలను దత్తత తీసుకున్నారు.
మరిన్ని వార్తల కోసం