వడ్లు కొనేవరకు పోరాటం కొనసాగుతోంది

వడ్లు కొనేవరకు పోరాటం కొనసాగుతోంది
  • పంటలు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే
  • రైతులకు ఆందోళన చెందొద్దు
  • ఎప్ సీఐ గోదాముల్లోని బియ్యాన్ని కుక్కులు, పందుల తింటున్నాయి
  • వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: పంటలు కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేవరకు పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వడ్లు కొనాలని ఎన్నిసార్లు విన్నవించనా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. బాయిల్డ్ రైస్ కొనబోమని, రా రైస్ మాత్రమే కొంటామని కేంద్రం చెబుతోందన్నారు. తెలంగాణలో పండిన యాసంగి వడ్లు రా రైస్ కి పనిరావని, బాయిల్ చేయకుంటే నూకలు అవుతాయని చెబితే కేంద్రం వినడంలేదన్నారు. కావాలంటే  మీ ప్రజలకు అవే నూకలు అలవాటు చేయాలని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానిస్తోందన్నారు. తెలంగాణ అంటే ఎందుకంత చిన్నచూపు అని మంత్రి ప్రశ్నించారు.

తెలంగాణ సమాజాన్ని అవమానించిన వాళ్ళు చరిత్ర పుటల్లో కలిసిపోయారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను అవమానించిన వారు రాజకీయంగా జాడ లేంకుండాపోయారన్నారు. కేంద్రం ఇంత ఘోరంగా అవమానిస్తుంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. కేంద్రంతో వడ్లు కొనిపిస్తామని చెప్పిన తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ మీద, కేసీఆర్ మీద విషం గక్కుతున్నారని ఆరోపించారు. రైతుల గురించి కేంద్రం ఏమాత్రం ఆలోచించడంలేదని, తెలంగాణ రైతులకు కేంద్రం క్షమాపణ చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కేంద్రానికి ముందు చూపులేదని, పాలన చేతకాకపోతే దిగిపోవాలన్నారు. కేంద్రం స్పందించకుంటే ఉగాది తర్వాత ఉద్యమం ఉధృతం చేస్తామని, అందుకు రైతులు సిద్ధంగా ఉండాలని కోరారు. 

మరిన్ని వార్తలకోసం...

గ్రామపంచాయతీలకు కేంద్రం కొత్త అకౌంట్లు

పీఈటీ పోస్టులన్నీ నింపాలె