
కొత్తగూడ, వెలుగు: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం గంగారంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం కొత్తగూడ మండలంలోని పలువురు లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు,కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అటవీచట్టాల మూలంగా కొన్ని రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయని, ఇటీవలే అటవీ శాఖ మంత్రి సురేఖతో సమావేశమైనట్లు తెలిపారు.
పర్మిషన్కోసం నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ కు వెళ్లినట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. భూమి లేని పేదలకు భూ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోడు భూమి లేని వారు కొత్తగా అడవిని నరకొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అప్పారావు, తహసీల్దార్ బాలకిషన్, హౌసింగ్ ఏఈ లాల్, డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ సరోజన, మాజీ జడ్పీటీసీ రమ, కాంగ్రెస్మండల అధ్యక్షుడు జాడి వెంకటేశ్వర్లు, నాయకులు పెనుక పురుషోత్తం, ముడిగె విజయ్, చింత సారక్క తదితరులు పాల్గొన్నారు.