
వయనాడ్: కేరళను భారీ వర్షాలు శోకసంద్రంలోకి నెట్టేశాయి. కేరళలోని వయనాడ్ జిల్లాలో గ్రామాలకు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయిన విషాద పరిస్థితులు నెలకొన్నాయి. 85 మందికి పైగా సజీవ సమాధి కావడంతో కేరళ పెను విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో కేరళ వరదలకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అయింది. రైల్వే ట్రాక్స్పై వరద నీరు పొంగిపొర్లుతున్న వీడియో అది.
#WATCH | Kerala: Stationary watchman stopped train no. 16526 between Vallathol Nagar-Wadakkanchery of Trivandrum division due to heavy rain & water flow on track.
— ANI (@ANI) July 30, 2024
The following trains are partially cancelled today due to heavy water logging reported between Valathol Nagar and… pic.twitter.com/L2Cuye0dE4
అంతేకాదు.. ఆ రైల్వే ట్రాక్ను ముంచెత్తేందుకు వరద నీరు యమా స్పీడ్గా పారుతోంది. ఆ సమయంలో రైలు ఆ పట్టాల పైకి వచ్చి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఒక స్టేషనరీ వాచ్మెన్ అప్రమత్తమై రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రైన్ నంబర్.16526 అదే సమయంలో ట్రాక్ మీదకు వస్తుండగా స్టేషనరీ వాచ్మెన్ రైలును ఆపాడు. దీంతో రైలు ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇదిలా ఉండగా.. కేరళలో వర్షాల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కొన్ని రైళ్ల దారి మళ్లించారు.
రద్దైన రైళ్ల వివరాలివి..
1. ట్రైన్ నంబర్ 06445
2. ట్రైన్ నంబర్ 06446
3. ట్రైన్ నంబర్ 06497
4. ట్రైన్ నంబర్ 06496
కేరళలో వరదల కారణంగా వరద నీరు పట్టాల పైకి చేరడంతో రైల్వే శాఖ నాలుగు రైళ్లను రద్దు చేసింది. 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. రెండు రైళ్లను రీషెడ్యూల్ చేసింది.