హైదరాబాద్, వెలుగు: సామాజిక భద్రత ఇచ్చే పాత పెన్షన్ ను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో1,72,000 మంది సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కంట్రిబ్యూషన్ను నిలుపుదల చేయాలని ఆయన కోరారు. కాగా, స్థిత ప్రజ్ఞ అధ్యక్షతన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సీపీఎస్ యూనియన్ జిల్లాల అధ్యక్షుల సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ 33 జిల్లాల అధ్యక్ష , కార్యదర్శులతో కలిసి పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. సంకల్ప యాత్ర ఈ నెల 16 నుంచి 31 వరకు అభీ నహీతో.. కభీ నహీ అనే నినాదంతో కొనసాగుతుందని ప్రకటించారు. పాతపెన్షన్ సాధన సంకల్ప రథయాత్రను విజయవంతం చేయాలని సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
