టెక్నీషియన్లకు రోజుకు రూ. 30 లక్షలు చెల్లించినా పవర్ ప్లాంట్ నడుస్తలే..

టెక్నీషియన్లకు రోజుకు రూ. 30 లక్షలు చెల్లించినా పవర్ ప్లాంట్ నడుస్తలే..

శ్రీశైలం ప్లాంట్​లో నెలాఖరుకి కరెంట్​ జనరేషన్​ లేనట్లే!

మొరాయిస్తున్న ఒకటి, రెండు యూనిట్లు

నాగర్ కర్నూల్, వెలుగు: శ్రీశైలం పవర్​ప్లాంట్ లో ఈ నెలాఖరు వరకు విద్యుత్​ ఉత్పత్తి స్టార్ట్​ చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఒకటి, రెండు యూనిట్లను పూర్తిగా రెడీ చేసిన ఇంజినీర్లు వాటిని రన్​చేయగా 400 కేవీ టవర్​లైన్​లో అవుట్​పుట్​100 కేవీ దాటకపోవడంతో తిరిగి నిలిపివేశారు. వీటిని పర్యవేక్షించడానికి చెన్నై నుంచి టెక్నీషియన్లను రప్పించారు. రోజుకు అక్షరాల 30 లక్షలు చెల్లిస్తున్నారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ట్రయల్​రన్​ కొలిక్కి రాలేదని  సమాచారం. దీంతో కేబుళ్లను తిరిగి టెస్ట్​చేస్తున్నారు. మరో పక్క సీఐడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన 15 రోజులు తర్వాత రెండు యూనిట్లను నడిపిస్తామని చెప్పిన జెన్​కో అధికారులు తర్వాత ఆ సమయాన్ని నెల రోజులకు పొడిగించారు. ఒకటి, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్​ఉత్పత్తి చేయడానికి ఆయిల్​ట్యాంకర్లను రెడీ చేసి ఆయిల్​మార్చడంతో పాటు కంప్రెషర్​ మోటార్లు ఫిట్​చేసి ట్రయల్​రన్​ చేశారు. నాలుగు, ఐదు, ఆరు యూనిట్ల కంప్రెషర్​ మోటార్లు విప్పి పెట్టారు. డీవాటరింగ్​ మోటార్లు ఎనిమిదింటికిగాను ప్రస్తుతం 4 నడుస్తున్నాయి. ఆరో యూనిట్​దగ్గర మరో మూడు మోటార్లు దింపుతారని సమాచారం. 1, 2, 3 యూనిట్లకు గవర్నర్​ మోటార్లు రెడీ చేశారు. ఈ నెల చివరి వరకు ఒకటి,రెండు యూనిట్లను రెడీ చేసి రన్​చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు అంటున్నా ఆశించినంత స్పీడ్​గా పనులు జరగడం లేదని సమాచారం.

జీఐఎస్​ రెడీ అయితేనే..

శ్రీశైలం పవర్​ ప్లాంట్​లో ఆగస్టు 20న ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి, అధికారులు రెస్క్యూ ఆపరేషన్, సహాయ చర్యలను పర్యవేక్షించారు. పొగబారిన ఫ్లోర్​లలో ఏముందో తెలియకముందే నష్టం పెద్దగా జరగలేదన్న అభిప్రాయంతో పాటు 15 రోజుల్లో రెండు యూనిట్లు నడిపిస్తామని ప్రకటించారు. సీఐడీ విచారణ, జెన్కో టెక్నికల్​టీం కమిటీల రిపోర్ట్​అందాల్సి ఉండగా మరోవైపు ప్లాంట్​ పునరుద్ధరణ పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు నాలుగు ఫ్లోర్ల క్లీనింగ్​పనుల మీద దృష్టి పెట్టారు. ఇందులో కీలకమైన జీఐఎస్​లో కంప్రెషర్లు, ట్రాన్స్ ఫార్మర్లను పరిశీలించడానికి గతంలో ఇక్కడ పనిచేసి విదేశాల్లో శిక్షణ పొందిన డీఈ వెంకటేశ్వర్​రెడ్డిని డిప్యుటేషన్​పై రప్పించారు. ఆయనతోపాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఎస్, జీఐఎస్​విభాగాల పర్యవేక్షణకు గతంలో ఇక్కడ పనిచేసిన దాదాపు 20 మంది సీనియర్​ ఇంజినీర్లను డిప్యూటేషన్​ మీద పిలిపించారు. ఆరు యూనిట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్​ను స్విచ్​యార్డ్​కు సరఫరా చేసే జీఐఎస్​ రెడీ అయితే తప్ప మొదటి రెండు యూనిట్ల నుంచి విద్యుత్​వచ్చే అవకాశం లేదని సమాచారం. అందులోని ప్రతిభాగాన్ని శుభ్రం చేసిన తర్వాత కట్​అయిన కేబుల్స్, ట్రాన్స్​ఫార్మర్లలో ఆయిల్​మార్చాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ విద్యుత్​ఉత్పత్తి కేంద్రాల్లో ఉన్న కేబుల్, విడి భాగాలు, ఆయిల్​ తెప్పించిన జెన్కో అధికారులు అందుబాటులో ఉన్నవాటితో సర్దుకుపోమని చెప్తున్నట్లు సమాచారం.

For More News..

స్మార్ట్​ఫోన్​ కోసం యువతి సూసైడ్​

టీఆర్ఎస్​ పార్టీ ఆఫీస్​కు కోటి రూపాయల భూమి రూ. 5 లక్షలకే

కాంగ్రెస్​ నాకు అన్యాయం చేసింది.. కేసీఆర్​ అవమానించిండు