హైదరాబాద్: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైర్లు వేశారు. తనకు వ్యతిరేకంగా పాంప్లెట్స్ నుఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేయించారని ఆరోపించారు. మెట్పల్లిలో ఇవాళ తనకువ్యతిరేకంగా పాంప్లెట్స్పంచిన ఘటనపై అర్వింద్స్పందిస్తూ ఇవేం పనులు అంకుల్ అంటూ జీవన్రెడ్డిని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే జీవన్ రెడ్డి సోదరుడు తనపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. జీవన్ రెడ్డి తనకు తండ్రి సమానుడు అని, ఆయన ఎదురుపడిన ప్రతిసారీ వంగి ఆశీర్వాదం తీసుకుంటానని తెలిపారు.
దానిలో మీకు అహంకారం ఎక్కడ కనబడిందని ప్రశ్నించారు. కండ్లకు కూలింగ్ ఉంటదని కళ్లద్దాలు పెట్టుకుంటానని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీకి ఎప్పుడు 3వేల నుంచి 4వేల ఓట్లు వచ్చేవని మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ కు దీటుగా ఓట్లు వచ్చాయన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఏ రేంజ్ లో వస్తాయో చూడాలని సూచించారు. 2014 నుంచి ఇదే చివరి ఎలక్షన్ అనుకుంటూ ఇప్పటివరకు పోటీ చేస్తూనే ఉన్నారని విమర్శించారు. జీవన్ రెడ్డి అంకుల్ మీ ఇంటి సభ్యులు చేస్తున్న చిల్లర రాజకీయాలను ఆపించాలని సూచించారు.