
కాశీబుగ్గ(కార్పొరేషన్),వెలుగు: గ్రేటర్ వరంగల్ సిటీలో వర్షం కురిసిన ప్రతిసారి కాలనీలు జలమయమవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ సిటీలోని 24వ డివిజన్లోని గోపాల స్వామి టెంపుల్ ప్రాంతంలోని ఏ టూ జెడ్ మెడికల్ షాపు వద్ద డ్రైనేజీలోని మురుగు నీరు రోడ్డు పైకి రావడంతో అక్కడే ఉన్న బస్ స్టాఫ్ చుట్టూ మురుగు నీరు నిల్చిపోవడంతో ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్నారు. మ్యాన్హోల్స్, డ్రైనేజీల నుంచి మురుగు బయటికి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.