స్నేహితులే హతమార్చారా..?
నిందితుల కోసం పోలీసుల గాలింపు
చందానగర్, వెలుగు: మద్యం మత్తులో స్నేహితుల మధ్య తలెత్తిన గొడవలో ఓ వ్యక్తి తలపై ఇనుప రాడ్డులో బలంగా కొట్టి హత్య చేశారు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి ఓల్డ్ఎంఐజీలో ఫ్లాట్ నెంబర్1879లోని రామ్జీ ఇంట్లో అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్రెడ్డి(43), సిద్దు, షాకీర్, రామ్జీ కలిసి మద్యం సేవించారు. అర్ధరాత్రి సమయంలో రామ్జీ నిద్ర పోయిన తర్వాత రాజశేఖర్రెడ్డి, సిద్దు, షాకీర్మద్యం తాగుతూనే ఉన్నారు. తాగిన మత్తులో సిద్దు, షాకీర్లు కలిసి రాజశేఖర్రెడ్డి తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశారు.
మంగళవారం సాయంత్రం రామ్ జీ నిద్ర నుంచి లేచి చూసేసరికి రాజశేఖర్రెడ్డి రక్తపుమడుగులో పడి ఉండడంతో వెంటనే చందానగర్ పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ రవీందర్ క్లూస్టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే రాజశేఖర్రెడ్డికి భార్య విడాకులు ఇవ్వడంతో అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. రామ్జీకి అతని భార్య విడాకులు ఇవ్వడంతో ఒంటరిగా ఉంటున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు.