పాము కాటుతో ఓ స్టూడెంట్ చనిపోయిన ఘటన దామరగిద్ద మండలం ఉడ్మలగిద్ద గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పదో తరగతి స్టూడెంట్ భాస్కర్(16) తన స్నేహితుడితో ప్రతిరోజూ పడుకుంటున్నాడు. శుక్రవారం కూడా స్నేహితుడితో కలిసి పడుకున్నాడు. రాత్రి 2 గంటలు దాటిన తర్వాత భాస్కర్ నిద్రలేచి ఇంట్లోకి పాము వచ్చిందని వారికి చెప్పగా.. వారు దానిని వెతికి చంపారు. కాగా కాసేపటికే భాస్కర్ కళ్లు తిరుగుతున్నాయని కిందపడ్డాడు. చెతికి పాము కాటు కనిపించడంతో తన కుటుంబీకులకు చెప్పి నాటువైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో జిల్లా దవాఖానకు తీసుకెళ్లగా డాక్టర్లు పరిశీలించి, అప్పటికే చనిపోయాడని చెప్పారు. చేతికొచ్చిన కొడుకు చనిపోడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అందరితో కలివిడిగా తిరిగే భాస్కర్ అర్ధాంతరంగా చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పాము కాటుతో స్టూడెంట్ మృతి
- తెలంగాణం
- July 28, 2019
లేటెస్ట్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- యూనివర్సిటీలకు కొత్త వీసీలు.. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్
- నల్లిబొక్క ఆగం జేసె!.. వృద్ధుడి గొంతులో ఇరుక్కున్న బోన్ తొలగించిన డాక్టర్లు
- రైతులకు అన్యాయం చేస్తే రోడ్డెక్కుతం: కేటీఆర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- పోలీసుల ప్రేక్షక పాత్ర.. నిందితులు 2 నిముషాల్లో దొరుకుతరు: ఆర్ఎస్పీ ట్వీట్
- రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు బంద్
- జూన్ 4న అధికారంలోకి ఇండియా కూటమి : మల్లికార్జున ఖర్గే
- ప్రపంచ అత్యుత్తమ జట్టుగా వర్ణన.. పాక్ క్రికెట్ చైర్మన్ను తిడుతున్న అభిమానులు
- తిరుమల రెండవ ఘాట్ రోడ్డుపై చిరుత కలకలం.
Most Read News
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!