పాము కాటుతో స్టూడెంట్‌‌ మృతి

పాము కాటుతో స్టూడెంట్‌‌ మృతి

పాము కాటుతో ఓ స్టూడెంట్‌‌ చనిపోయిన ఘటన దామరగిద్ద మండలం ఉడ్మలగిద్ద గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పదో తరగతి స్టూడెంట్‌‌ భాస్కర్(16) తన స్నేహితుడితో ప్రతిరోజూ పడుకుంటున్నాడు. శుక్రవారం కూడా స్నేహితుడితో కలిసి పడుకున్నాడు. రాత్రి 2 గంటలు దాటిన తర్వాత భాస్కర్‌‌‌‌ నిద్రలేచి ఇంట్లోకి పాము వచ్చిందని వారికి చెప్పగా.. వారు దానిని వెతికి చంపారు. కాగా కాసేపటికే భాస్కర్‌‌‌‌ కళ్లు తిరుగుతున్నాయని కిందపడ్డాడు. చెతికి పాము కాటు కనిపించడంతో తన కుటుంబీకులకు చెప్పి నాటువైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో జిల్లా దవాఖానకు తీసుకెళ్లగా డాక్టర్లు పరిశీలించి, అప్పటికే చనిపోయాడని చెప్పారు. చేతికొచ్చిన కొడుకు చనిపోడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అందరితో కలివిడిగా తిరిగే భాస్కర్‌‌‌‌ అర్ధాంతరంగా చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.