బొల్లారంలో బస్సుల కోసం స్టూడెంట్స్​ ఆందోళన

బొల్లారంలో బస్సుల కోసం స్టూడెంట్స్​ ఆందోళన

జిన్నారం, వెలుగు : స్కూళ్లు, కాలేజీల సమయానికి బస్సులు నడపడం లేదని శుక్రవారం బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో స్టూడెంట్స్​ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సులు లేక తీవ్ర ఇబ్బదులు పడుతున్నా, విషయాన్ని  ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినాపట్టించుకోవడంలేదన్నారు. ఉదయం పూట వచ్చే ఒకే బస్సులో ఫుట్​బోర్డుపై ప్రయాణించాల్సి  వస్తోందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టూడెంట్స్​ధర్నాకు బీజేపీ నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో స్టూడెంట్స్, ఉద్యోగులు పాల్గొన్నారు.