సమస్యలు పరిష్కరించాలని బాసర ఐఐఐటీ విద్యార్థుల ధర్నా

సమస్యలు పరిష్కరించాలని బాసర ఐఐఐటీ విద్యార్థుల ధర్నా

బాసర్ ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.  తరగతుల్ని బహిష్కరించి నిరసన చేపట్టారు వందలాది మంది విద్యార్థులు. కాలేజీలో సమస్యలు, కాలేజీ మెయింటనెన్స్ సరిగ్గా లేదంటున్నారు.  రెగ్యులర్ వీసీతో పాటు.. తగిన ఫ్యాకల్టీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియాను లోపలికి అనుమతించడం లేదు. మెయిన్ గేట్ ముందు బీఎస్పీ ఆందోళనకు దిగింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు మద్దతు తెలిపారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష్కరించాలన్నారు.