స్క్వాడ్లపై..మాస్ కాపీయింగ్ స్టూడెంట్స్ రాళ్లదాడి 

 స్క్వాడ్లపై..మాస్ కాపీయింగ్  స్టూడెంట్స్ రాళ్లదాడి 

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ఓ డిగ్రీ కాలేజీలో విద్యార్థులు రెచ్చిపోయారు. ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్స్ పై దాడికి యత్నించారు. కారు అద్దాలు ద్వంసం చేసి వీరంగం సృష్టించారు. పరీక్షలో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న 10 మంది విద్యార్థులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా వారిని డిబార్ చేశారు. వారిలో నలుగురు మహిళా విద్యార్థినులు ఉన్నారు. ఇంకోసారి ఇలా చేయమని..డిబార్ చేయొద్దని అధికారులు వేడుకున్నా వారు వినిపించుకోలేదు. ఇక అంతే ప్లయింగ్ స్క్వాడ్స్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతున్న అధికారుల కార్లపై రాళ్లదాడికి దిగారు. 

విద్యార్థుల రాళ్లదాడిలో అధికారులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.