నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. -క్యాంప్ గ్రౌండ్ లో బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ ప్రమాదవశాత్తు కిందపడి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో -గాయాలైన విద్యార్థులను పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగా నేడు అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్17న హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ సెంట్రల్ లాన్స్లో జరిగే తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.