
- బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ
ముషీరాబాద్, వెలుగు : క్వశ్చన్పేపర్ల లీకేజీలతో స్టూడెంట్లు, నిరుద్యోగుల జీవితాలు నాశనం అవుతున్నాయని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 20 లక్షల మందికి పైగా రాస్తున్న నీట్పేపర్ లీక్అవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సోమవారం ఆయన విద్యానగర్ బీసీ భవన్లో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..
రాత్రి, పగలు అనే తేడా లేకుండా లక్షల మంది ఎగ్జామ్స్ కు ప్రిపేర్అవుతుంటే.. కొందరు దొడ్డి దారిలో సీట్లు కైవసం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఫలితంగా బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులు మౌనం వీడి, నీట్కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని కోరారు. నీట్ అభ్యర్థులకు బీసీ విద్యార్థి సంఘం అండగా ఉంటుందని చెప్పారు.