అన్నంలో గాజు ముక్కలు..ఓయూ విద్యార్థుల ఆందోళన

అన్నంలో గాజు ముక్కలు..ఓయూ విద్యార్థుల ఆందోళన

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఓయూ గర్ల్స్ హాస్టల్ లో అన్నంలో గాజు ముక్కలు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండు వారాలుగా భోజనం సరిగ్గా ఉండటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మెస్ బిల్లులు కట్టిన లిమిటెడ్ గా భోజనం పెడుతున్నారని అంటున్నారు. తమకు ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు స్టూడెంట్స్.