స్టూడెంట్లు సైంటిస్టులుగా మారాలి.. కంటోన్మెంట్ లో సైన్స్ సెంటర్ ప్రారంభం

స్టూడెంట్లు సైంటిస్టులుగా మారాలి..  కంటోన్మెంట్ లో సైన్స్ సెంటర్ ప్రారంభం

పద్మారావునగర్​, వెలుగు: ప్రతి పేద విద్యార్థి మంచి సైంటిస్టు కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న అక్షయ విద్యా ఫౌండేషన్ ఆశయం చాలా గొప్పదని కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ఎస్​.రాజీవ్ కొనియాడారు. ఖాళీగా ఉన్న కంటోన్మెంట్ స్కూల్ భవనంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన సైన్స్​సెంటర్​ ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన గెస్ట్​గా హాజరయ్యారు. 

ప్రస్తుతం ట్విన్​ సిటీస్​ లో మొత్తం 140 అక్షయ విద్యా లెర్నింగ్​ సెంటర్లు విజయవంతంగా నడుస్తున్నాయని, ఇందులో 4 వేల మంది స్టూడెంట్లు ప్రతి రోజు సాయంకాలం చదువు నేర్చుకుంటున్నారని అక్షయ విద్యా ఫౌండేషన్​ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్​ సీఈవో మధుకర్​నాయక్​, ప్రతినిధులు పాల్గొన్నారు.