మంచిర్యాల జిల్లాలో రోడ్డు పై విద్యార్ధులు ధర్నా నిర్వహించారు. తాండూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి ఐబీ అంగడి వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి లోకి వర్షపు నీరు చేరింది. దీంతో తాత్కాలింగా రైల్వే అండర్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. దీంతో వాహనదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాండూర్, రేచిని, అచ్చులపూర్,భీమిని గ్రామాలకు వెళ్ళే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆగ్రహించిన విద్యార్ధులు, తల్లిదండ్రులు వాహనదారులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. సమస్య పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తాండూర్ ఎస్ఐ సమ్మయ్య చెప్పడంతో ధర్నా విరమించారు.