
చేవెళ్ల, వెలుగు: బస్సులు పెంచడంతోపాటు సమయపాలన పాటించాలని కోరుతూ సోమవారం చేవెళ్ల మండలంలోని కమ్మెట ఎక్స్ రోడ్పై విద్యార్థులు బైఠాయించారు. బస్సులు సరిపడా లేకపోవడంతో సమయానికి విద్యాసంస్థలకు చేరుకోలేకపోతున్నామని, క్లాస్లు సైతం మిస్సవుతున్నామని వాపోయారు. ఆర్టీసీ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.