సీఎం సార్​..మా స్కూల్​కు టీచర్లు కావాలి

సీఎం సార్​..మా స్కూల్​కు టీచర్లు కావాలి

పర్వతగిరి(ఐనవోలు), వెలుగు: తమ స్కూల్​లో  టీచర్లు లేరని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, విద్యాశాఖ కమిషనర్​  దేవసేనకు  స్టూడెంట్స్​గురువారం పోస్టు కార్డులు రాశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో స్కూల్​లో 468 మంది స్టూడెంట్స్​ఉన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 8మంది టీచర్లుండగా, 6నుంచి 10వ తరగతి వరకు ఒక్క టీచర్​ ఉండగా ఎస్​ఎంసీ( స్కూల్​ మేనేజ్​మెంట్​ కమిటీ) చైర్మన్​ పొన్నాల రాజు, స్థానికులు కలిసి కొద్ది రోజులుగా ప్రైమరీ టీచర్లను హైస్కూల్ స్టూడెంట్స్​కు చెప్పిస్తున్నారు. ప్రైమరీ స్టూడెంట్లకు ప్రైవేటు టీచర్లను ఏర్పాటు చేశారు. దీంతో  స్కూల్​కు  ఏడుగురు స బ్జెక్టు టీచర్లు, హెడ్మాస్టర్​, పీఈటీ  అవసరముందని స్టూడెంట్లు పోస్టు కార్డులు రాశారు.