
బోధన్, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. మంగళవారం సాలూర మండలంలోని మంధర్నాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు స్వీకరించి పరిశీలించారు. బోధన్ మండలం నాగన్పల్లిలో తహసీల్దార్ విఠల్ రెవెన్యూ సదస్సు నిర్వహించి సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శేఖర్, ఆర్ఐ గంగాధర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
బీర్కూర్ మండలం అన్నారం గ్రామంలో..
బీర్కూర్, వెలుగు : మండలంలోని అన్నారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొని దరఖాస్తులను స్వీకరించి రైతులతో మాట్లాడారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ లత, మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, లీడర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.
రాంపూర్, మగ్గిడి గ్రామాల్లో..
ఆర్మూర్, వెలుగు: మండలంలోని రాంపూర్, మగ్గిడి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రాంపూర్ గ్రామంలో తహసీల్దార్ సత్యనారాయణ, మగ్గిడి గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్ సుజాత హాజరై దరఖాస్తులు స్వీకరించారు.