రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి : సబ్ కలెక్టర్​ వికాస్ మహతో

రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి : సబ్ కలెక్టర్​ వికాస్ మహతో

బోధన్​, వెలుగు: భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో సూచించారు. మంగళవారం సాలూర మండలంలోని మంధర్నాలో నిర్వహించిన  రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు స్వీకరించి పరిశీలించారు. బోధన్​ మండలం నాగన్​పల్లిలో తహసీల్దార్​ విఠల్ రెవెన్యూ సదస్సు నిర్వహించి సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించారు.  కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శేఖర్, ఆర్ఐ గంగాధర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.  

బీర్కూర్​ మండలం అన్నారం గ్రామంలో..

బీర్కూర్, వెలుగు : మండలంలోని అన్నారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో బాన్సువాడ సబ్​ కలెక్టర్​ కిరణ్మయి పాల్గొని దరఖాస్తులను స్వీకరించి రైతులతో మాట్లాడారు. ఎలాంటి భూ సమస్యలు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో తహసీల్దార్​ లత, మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి,  లీడర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు. 

రాంపూర్​, మగ్గిడి గ్రామాల్లో..

​ఆర్మూర్​, వెలుగు: మండలంలోని  రాంపూర్​, మగ్గిడి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రాంపూర్ గ్రామంలో తహసీల్దార్​ సత్యనారాయణ, మగ్గిడి గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్​ సుజాత హాజరై దరఖాస్తులు స్వీకరించారు.