లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన మానవీయతను చాటుకుంటున్నాడు. ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసి వారికి అండగా నిలబడుతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ విపత్కర సమయంలో ఆయన చేసిన సేవలను ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
తాజాగా ప్రముఖ శాండ్ అర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ సోనూసుద్ కి తన ఆర్ట్ తో అభినందనలు తెలిపాడు. వలస కార్మికులు స్వస్థలాలకు చేరేందుకు అన్ని విధాలుగా సహకరించిన రియల్ హీరో సోనూ సూద్ అంటూ.. పట్నాయక్ ఒడిశాలోని పూరి బీచ్ లో సోనూసుద్ సైకత శిల్పాన్ని రూపొందించాడు.
‘కరోనా సమయంలో మీరు చేసిన సాయానికి సెల్యూట్ చేస్తున్నాం .యు ఆర్ ద రియల్ హీరో. వలస కార్మికులకు మీరు చేసిన సాయాన్ని వివరించడానికి మాటలు కూడా సరిపోవు. మీకు మా కృతజ్ఞతలు అనే శీర్షికతో శాండ్ఆర్ట్ను సోనూకి అంకితం చేశాడు పట్నాయక్. ఈ ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ సోనూసూద్కు ట్యాగ్ చేశాడు. ‘థ్యాంక్యూ బ్రదర్ . ఈ ఆర్ట్ నన్ను ఎంతో ప్రోత్సహిస్తున్నది. లవ్ యూ సో మచ్. ఒకసారి నిన్ను కలిసి గట్టిగా కౌగిలించుకోవాలని ఉంది’ అని సోనూ రీట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫొటో వైరల్గా మారింది.
Thank you so much brother. Beginning my day with this encourages me to work harder. Love you so much ? and wish to come and give you a tight hug soon. ? https://t.co/AzUSBDxPjI
— sonu sood (@SonuSood) June 1, 2020