బాలికలకు కేన్సర్ టీకా ఇవ్వండి : ఎంపీ సుధామూర్తి

బాలికలకు కేన్సర్ టీకా ఇవ్వండి : ఎంపీ సుధామూర్తి
  • తొలి స్పీచ్​లో ప్రభుత్వానికి ఎంపీ సుధామూర్తి విజ్ఞప్తి

న్యూఢిల్లీ:  రచయిత్రి, ఎంపీ సుధామూర్తి రాజ్యసభలో చేసిన తొలి ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. మహిళా ఆరోగ్యంపై బుధవారం ఆమె మాట్లాడారు. దీనిపై రాజ్యసభకు వచ్చిన మోదీ స్పందించారు. విమెన్​ హెల్త్​పై మాట్లాడిన సుధామూర్తిని ప్రశంసించారు. విమెన్స్​ డే సందర్భంగా రాష్ట్రపతిచే రాజ్యసభకు నామినేట్​ అయిన సుధామూర్తి పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడుతూ.. సర్వైకల్ క్యాన్సర్​ను ఎదుర్కొనేందుకు భారత సర్కారు చేపట్టిన వ్యాక్సినేషన్​ ప్రోగ్రామ్​ను ప్రస్తావించారు. ‘‘9–14 ఏండ్ల మధ్య వయస్సుగల బాలికలకు సర్వైకల్​ క్యాన్సర్​ టీకాలు ఇస్తుంటారు.

ఆ టీకాను గర్ల్స్​ తీసుకుంటే క్యాన్సర్​ను అడ్డుకోవచ్చు. చికిత్స కంటే నివారణే ఉత్తమం కాబట్టి.. బాలికలకు భవిష్యత్తులో క్యాన్సర్​రాకుండాఈ టీకా అందేలా ప్రమోట్​ చేయాలి” అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తన తండ్రి చెప్పిన ఓ కొటేషన్​ను గుర్తు చేశారు. “కుటుంబంలో తల్లి చనిపోతే దవాఖాన లెక్కల్లో ఒకరు మృతిచెందినట్టు.. కానీ.. ఆ ఫ్యామిలీకి మాత్రం  తీరని లోటు” అని పేర్కొన్నారు. కొవిడ్​ సమయంలో భారత సర్కారు అతిపెద్ద వ్యాక్సినేషన్​ డ్రైవ్​ నిర్వహించిందని, 9–14 ఏండ్ల బాలికలకు సర్వైకల్​ క్యాన్సర్​ టీకాలు వేయడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. 

సుధామూర్తికి మోదీ కృతజ్ఞతలు

తన ప్రసంగంలో మహిళా ఆరోగ్యం, వ్యాక్సినేషన్​ డ్రైవ్​ గురించి మాట్లాడినందుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం 10 ఏండ్ల నుంచి ప్రాధాన్య రంగంగా విమెన్​ హెల్త్​, సానిటేషన్​పై ప్రత్యేక దృష్టిపెట్టిందని చెప్పారు. మహిళల కోసం ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించినట్టు వివరించారు. శానిటరీ ప్యాడ్స్​ అందజేశామని, గర్భిణులకు వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.