భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారుపాడులో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోక పోవడంతో..పురుగులు మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. అన్నారపాడుకు చెందిన గుగులోత్ గోపి, సింధు దగ్గరి బంధువులు. కొంత కాలంగా వీరు ప్రేమించుకుంటున్నారు. పెళ్ళి చేసుకుందామని ఆ విషయం పెద్దలతో చెప్పారు. అయితే పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో గ్రామ శివారులోని పొలాల్లోకి వెళ్ళి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘనటా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు.