హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు పొడి వాతావరణం ఉంటుందని, సోమవారం నుంచి ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆగ్నేయ, తూర్పు నుంచి వడగాలులు వీస్తుండడంతో ఆదివారం సాధారణం కంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైనట్లు చెప్పారు.
మహబూబ్ నగర్ లో అత్యధికంగా 36డిగ్రీలు, భద్రాచలం 35.5, మెదక్ లో 35డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. చలి తగ్గు ముఖం పడుతుండడంతో రాత్రి ఉష్ణో గ్రతలు పెరుగుతున్నా యి. ఆదిలాబాద్ లో 19, నిజామాబాద్ , రామగుండంలలో 24డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.