Astrology : కన్యా రాశిలోకి సూర్యుడు, బుధుడు.. శక్తివంతమైన ఈ 42 రోజులు ఏయే రాశుల వాళ్లకు కలిసొస్తుంది.. ఎవరు పరిహారాలు చేయాలి..

Astrology : కన్యా రాశిలోకి సూర్యుడు, బుధుడు.. శక్తివంతమైన ఈ 42 రోజులు ఏయే రాశుల వాళ్లకు కలిసొస్తుంది.. ఎవరు పరిహారాలు చేయాలి..

2025, సెప్టెంబర్ 17న కన్యా రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. ఇప్పటికే కన్యా రాశిలో బుధ సంచారం జరుగుతుంది. సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడి రాకతో.. బుధాదిత్య యోగం ఏర్పడినట్లు చెబుతున్నారు పండితులు. ఈ బుధాదిత్యయోగం అనేది 42 రోజులు ఉంటుందని.. అంటే అక్టోబర్ 29వ తేదీ వరకు ఈ యోగం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంపై ఈ బుధాదిత్యయోగం ప్రభావం చూపిస్తుందని స్పష్టం చేస్తున్నారు జ్యోతిష్య పండితులు. ఏయే రాశులు.. అంటే 12 రాశుల వాళ్లకు ఈ బుధాదిత్యయోగం ఎలా ఉంటుంది.. ఎవరి బాగుంటుంది.. బాగోలేని వారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది విషయాలను కూడా జ్యోతిష్య పండితులు వివరంగా చెబుతున్నారు. ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

  • సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడంతో ధనుస్సు, మీనం, వృషభ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగాలు, వ్యాపారం, విద్యా రంగంలో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు, .   
  • కర్కాటక రాశి వారికి   మంచి అదృష్ట యోగం పడుతుందట. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా అధికార యోగం...  అన్ని అంశాల్లోనూ శీఘ్రగతిన పురోగతి ఉంటుందని పండితులు అంటున్నారు.
  • సింహ రాశి వారికి  ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వీరి మాటకు, చేతకు విలువ పెరిగి.. . కుటుంబంలో జీవిత భాగస్వామికి, పిల్లలకు అంచ నాలకు మించిన పురోగతి ఉంటుంది. 
  • మిథునం, తుల రాశి వారు ఈ సమయంలో ఓర్పు, నిగ్రహం కలిగి ఉండాలి.
  • మేషరాశి, కుంభరాశిపై సూర్యుని సంచారం మంచి ప్రభావం చూపదు. ఈ సమయంలో ఈ రాశులకు చెందిన వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది.
  • కన్య రాశి వారు మరింత చురుకుగా ఉంటారు. సవాళ్లను సులభంగా ఎదుర్కొంటారు
  • వృశ్చికరాశివారికి  కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం తప్పకుండా మలుపు తిరుగుతుందంటున్నారు పండితులు . అనేక అంశాలలో పురోగతి... ఆర్థిక స్థిరత్వంతో పాటు ఆర్థిక పురోగతి ఉండే అవకాశం ఉంది. 
  • ధనుస్సు రాశివారికి  ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అధికారం చేతికి వచ్చే అవకాశం ఉంది. ఒక పెద్ద వాణిజ్య సంస్థను నిర్వహించే అవకాశం వస్తుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. 

చేయాల్సిన పరిహారాలు

  •  సూర్యభగవానుడికి నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి.  సూర్యనమస్కారాలు చేయాలి, 
  •  రాగి పాత్రలో నీటిని తీసుకుని.. అందులో ఎర్రటి పువ్వులు, అక్షతలు, బెల్లం వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
  •  ఓం ఘృణి సూర్యాయ నమః మంత్రాన్ని జపించండి. సూర్యుని ఆశీస్సులు , పూర్వీకులకు శాంతి రెండూ లభిస్తాయి.
  •  దానధర్మాలు, స్నానం, అర్ఘ్యానికి, నైవేద్యాల వల్ల దీర్ఘకాలంగా పెండింగ్​ సమస్యలు పరిష్కారమవుతాయి. 
  •  పేదలకు ఆహారం, నువ్వులు, బట్టలు, దక్షిణ దానం ఇవ్వండి
  •  పూర్వీకులకు ప్రత్యేక తర్పణం, పిండ ప్రదానం, శ్రద్ధా కర్మలను చేయడం శుభప్రదంగా భావిస్తారు.

 బుధుడి సొంతరాశి  కన్యారాశిలో సూర్యుడుతో కలిసి  ఉండటం చాలాశక్తివంతమైనదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఈ సమయంలో ఏర్పడిన బుధాదిత్యయోగం.. తెలివి తేటలు.. సంపద.. కమ్యూనికేషన్​  మొదలగు విషయాల్లో ప్రాధాన్యత ఉంటుంది.