ధమాకా దర్శకుడితో సందీప్ కిషన్ కొత్త సినిమా

ధమాకా దర్శకుడితో సందీప్ కిషన్ కొత్త సినిమా

ఇటీవల ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సందీప్ కిషన్.. తాజాగా ఓ కొత్త సినిమాకు సైన్ చేశాడు. మంగళవారం ఈ మూవీని అనౌన్స్ చేశాడు. త్రినాథరావు నక్కిన దీనికి దర్శకుడు. ‘ధమాకా’ తర్వాత తను డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఫుల్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లే  డైలాగ్స్ అందిస్తున్నాడు.

సందీప్ కిషన్‌‌‌‌‌‌‌‌తో ‘ఊరు పేరు భైరవకోన’ తీసిన ఏకే ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాజేష్ దండా  నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌. సందీప్ కిషన్ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 30వ సినిమా. ఇందులో అతను డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడని, హై టెక్నికల్ వాల్యూస్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కించనున్నామని మేకర్స్ తెలియజేశారు.