హైదరాబాద్, వెలుగు : నామినేటెడ్ పదవుల్లో మహిళా నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు కోరారు. మంగళవారం గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జాతీయ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హసీనాల ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్జిల్లా కమిటీలు, బ్లాక్ కమిటీలు, డివిజన్, మండల, పట్టణ, వార్డ్ కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని సునీతారావు కోరారు. నామినేటెడ్ పదవులకు సంబంధించి కాంగ్రెస్ మహిళా నేతల నుంచి దరఖాస్తులు, బయోడేటాను తీసుకున్న సునీతా రావు.. ఆ వివరాలను మహేశ్ కుమార్గౌడ్కు అందజేశారు. తమ విజ్ఞప్తిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
