నా ఊళ్లో ప్రోగ్రాం జరిగితే సమాచారం ఇవ్వరా?..  ఆఫీసర్లపై  సునితారెడ్డి ఫైర్​

నా ఊళ్లో ప్రోగ్రాం జరిగితే సమాచారం ఇవ్వరా?..  ఆఫీసర్లపై  సునితారెడ్డి ఫైర్​

మెదక్ (శివ్వంపేట), వెలుగు: నా సొంతూర్లో ప్రోగ్రాం గురించి నాకు సమాచారం ఇవ్వరా?   అని రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​ పర్సన్​ సునితారెడ్డి ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శివ్వంపేట మండలం గోమారంలో  శనివారం రైతు వేదిక  ఓపెనింగ్​ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.  

ఈ కార్యక్రమానికి  సునితారెడ్డి, నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సునితారెడ్డి మాట్లాడుతూ..  గ్రామంలో ఏర్పాటు చేసిన  కార్యక్రమం గురించి ఆఫీసర్లు ఎవరూ తనకు సమాచారం ఇవ్వలేదన్నారు.  ఎమ్మెల్యే మదన్ రెడ్డి చెబితే వచ్చానన్నారు.

అంతేగాక సభా వేదిక మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్​లో  తన ఫొటో లేదని తహసీల్దార్​ శ్రీనివాస్ చారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రోటోకాల్ పాటించని తహసీల్దార్ పై  చీఫ్ సెక్రటరీకి  కంప్లైంట్​ చేస్తానన్నారు.