జెండా మోసినోళ్లకే టికెట్​ ఇవ్వాలి : సుంకిరెడ్డి రాఘవేందర్​రెడ్డి

జెండా మోసినోళ్లకే టికెట్​ ఇవ్వాలి : సుంకిరెడ్డి రాఘవేందర్​రెడ్డి

నాగర్​కర్నూల్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డ వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి టికెట్​ ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్​ నాయకుడు, ఐక్యతా ఫౌండేషన్​ చైర్మన్​ సుంకిరెడ్డి రాఘవేందర్​రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వెల్డండ మండల కేంద్రంలో ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తిని అన్నిరంగాల్లో అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో ఐక్యతా ఫౌండేషన్​ ఏర్పాటు చేసి ఆర్థికసాయం అందించడంతో పాటు కాంగ్రెస్​ అభిమానులను ఒక తాటిపైకి తెచ్చామన్నారు. కార్యకర్తలు, అభిమానుల నిర్ణయమే అంతిమమని, పార్టీ టికెట్​ ఇస్తే పోటీ చేస్తానని, కార్యకర్తలు, అభిమానులు ఆదేశిస్తే అందుకు కట్టుబడి పోటీలో ఉంటానని చెప్పారు.