ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ దగ్గర సూపర్ లగ్జరీ బస్సులో వచ్చిన మంటలు వచ్చాయి. డ్రైవర్ వెంటనే అలర్టై బస్సును ఆపేశాడు. ప్రయాణికులను దింపేశాడు. హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సులో మంటలు వచ్చాయి. ప్యాసింజర్లు దిగిపోవడంతో... పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో.. బస్సులో 29మంది ఉన్నారు. బస్సు వెనక వైపు నుంచి పొగలు వస్తున్నాయని ప్యాసింజర్లు డ్రైవర్ కు చెప్పారు. వెంటనే డ్రైవర్ అలర్టయ్యాడు.
హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లక్జరీ బస్సు లో మంటలు.
— V6 News (@V6News) July 23, 2021
స్టేషన్ ఘన్పూర్ వద్ద ఘటన పూర్తిగా దగ్దమైన బస్సు. ప్రయాణికులను కిందకు దించడంతో తప్పిన పెను ప్రమాదం. #Bus #Fire #V6News pic.twitter.com/F4fRRDrdoM