Rajinikanth: సాధారణ ప్రయాణికుడిలా రజినీకాంత్..చూస్తూ ఉండిపోయిన ప్రయాణికులు

Rajinikanth: సాధారణ ప్రయాణికుడిలా రజినీకాంత్..చూస్తూ ఉండిపోయిన ప్రయాణికులు

తన జీవితం గురించి..తను జీవితం ఎలా మొదలైంది అనేది చెప్పుకోవటానికి ఎప్పుడూ సిగ్గుపడని సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క రజినీకాంత్ (Rajinikanth) మాత్రమే. ఎంతో సాధారణ జీవితాన్ని గడిపే రజినీ లాంటి వ్యక్తులు వేలలో ఒకరుంటారేమో అనిపిస్తోంది. కొన్నిసార్లు ఆలోచిస్తే అసలు ఎవ్వరూ ఉండరేమో అనిపిస్తోంది. ఎందుకంటే, చిన్న సక్సెస్ వస్తేనే నేల మీద కూడా నడవని వారుంటారు. ఇంకాస్తా పెద్ద సక్సెస్ వస్తే..అసలు చేసిన ప్రయాణం కూడా గుర్తుకు రాని వాళ్ళు ఉంటారు. అందులో అందరికీ పూర్తి భిన్నమైన వ్యక్తి రజినీకాంత్ ఒకరని చెప్పడంలో సందేహం లేదు.  

జైలర్ సక్సెస్తో రజనీ కాంత్‍ తన నెక్స్ట్ మూవీపై  ఫోకస్ పెట్టాడు. తలైవా170 మూవీ వెట్టయాన్‌గా (తెలుగులో వేటగాడు) వస్తోన్న ఈ మూవీని జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ (Tj Gnanavel) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ కడపలో జరుగుతోంది. ఈ సందర్భంగా రజినీ చెన్నై నుంచి కడపకు విమానంలో ఓ సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్‌లో వచ్చారు.దీంతో రజనీకాంత్‌ తమ విమానంలో ప్రయాణిస్తున్నారన్న విషయం తెలియడంతో..ప్రయాణికులు మస్తు ఖుషి అయ్యారు.

ఆయనని చూడటానికి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసే వారి కల..ఇలా ఒక ప్రయాణంలో సడెన్గా వస్తుందని ఏ మాత్రం ఉహించలేదంటున్నారు. అయితే..రజనీ కాంత్‍ విమానంలో ఎయిర్‌ పాడ్స్‌ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తే..ఇక ప్యాసింజర్స్ అంత రజినీని చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఈ మూవీలో రజినీ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. జైలర్ తో ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల టార్గెట్ దిశగా రానున్న ఈ మూవీ 2024 సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్, ఫాహద్‌ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.