అదానీ గ్రూప్పై దర్యాప్తుకు మరో 3 నెలలు టైమ్‌‌‌‌‌‌‌‌

అదానీ గ్రూప్పై దర్యాప్తుకు మరో 3 నెలలు టైమ్‌‌‌‌‌‌‌‌
  • సెబీకి గడువు పెంచిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్​–హిండెన్‌‌‌‌బర్గ్​ రిపోర్టు అంశంలో దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చేందుకు సెబీకి సుప్రీం కోర్టు బుధవారం నాడు మరో 3 నెలల టైము ఇచ్చింది. సెబీ తమకు ఆరు నెలలు కావాలని కోరినప్పటికీ, సుప్రీం కోర్టు ఆగస్ట్‌‌‌‌‌‌‌‌ 14 వరకు మాత్రమే టైమ్‌‌‌‌‌‌‌‌  ఇచ్చింది. ఇప్పటికే 5 నెలల టైము ఇచ్చినందున, ఇంతకంటే ఎక్కువ టైము ఇవ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఈ కేసు విచారణ సోమవారం వాయిదా పడిన విషయం తెలిసిందే. దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో చెబుతూ ఒక స్టేటస్​ రిపోర్టు సబ్మిట్ చేయాల్సిందిగా సెబీని చీఫ్​ జస్టిస్​ డీ వై చంద్రచూడ్​ నాయకత్వంలోని బెంచ్​ ఆదేశించింది. జస్టిస్​ పీ ఎస్​ నరసింహ, జస్టిస్​ జే బీ పర్దివాలు కూడా ఈ బెంచ్​లో ఉన్నారు. తమకు సబ్మిట్​ చేసిన జస్టిస్​ ఏ ఎం సప్రే కమిటీ రిపోర్టును పార్టీలకు కూడా అందజేయాల్సిందిగా బెంచ్​ సెబీకి ఉత్తర్వులు జారీ చేసింది.