పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు

పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
  •     2014లో దాడి కేసులో ఎమ్మెల్యేకు జిల్లా కోర్టు శిక్ష
  •     స్టే ఇచ్చిన హైకోర్టు  అత్యున్నత న్యాయస్థానం నోటీసులతో చర్చ

సంగారెడ్డి, వెలుగు : పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 2014లో పటాన్ చెరు సమీపంలోని ఓ పరిశ్రమపై దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యేను దోషిగా నిర్ధారిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు రెండున్నరేండ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ అప్పట్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జిల్లా కోర్టు తీర్పు పై స్టే ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేసులో స్టే కొనసాగుతూ వస్తున్నది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టేపై న్యాయవాది ఎంఏ.ముఖిమ్ ఇటీవల సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితోపాటు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది.