న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత సత్యేందర్ జైన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. బుధవారం సుప్రీంకోర్టులో జైన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్మిథాల్లతో కూడిన బెంచ్తీర్పును రిజర్వ్లో ఉంచింది.
మనీ లాండరింగ్ కేసులో 2022, మే 30న ఎన్ఫోర్స్మెంట్డైరెక్టరేట్(ఈడీ) జైన్ను అరెస్టు చేసింది. తనకు తెలిసిన నాలుగు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడని ఆరోపించింది. అయితే, ట్రీట్మెంట్ కోసం 2023, మే 26న జైన్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దానిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. ఇదే కేసులో తన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడాన్ని జైన్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.