- చేవెళ్ల ఘటనపై సుప్రీంకోర్టు రోడ్సేఫ్టీ కమిటీ సమీక్ష
హైదరాబాద్సిటీ, వెలుగు: ఆర్టీసీ బస్సుల ఫిట్ నెస్ పై మరోసారి తనిఖీలు చేయాలని సుప్రీంకోర్టు రోడ్సేఫ్టీ కమిటీ ఆర్టీఏ అధికారులను ఆదేశించింది. అలాగే ప్రైవేట్ బస్సులు, కమర్షియల్వాహనాలను తనిఖీ చేసి ఫిట్ నెస్లేకపోతే సీజ్ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని రోడ్ సేఫ్టీ కమిటీ చైర్మన్జస్టిస్ అభయ్మనోహర్సప్రే, సభ్యులు సంజయ్ బందోపాధ్యాయ్ గురువారం హైదరాబాద్కు విచ్చేశారు.
ఈ సందర్భంగా ఇటీవల చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాద ఘటనపై వారు సమీక్షను నిర్వహించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ కమిషనర్అవినాశ్ మహంతి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, మైనింగ్డైరెక్టర్భావేశ్ మిశ్రా, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర గౌడ్, ఆర్టీసీ, నేషనల్హైవే అథారిటీ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కమిటీ.. చేవెళ్ల ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నది. ఆర్టీసీ బస్సులకు రీ ఫిట్ నెస్నిర్వహించాలని, ఫిట్ నెస్లేని అన్ని రకాల వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించింది. ప్రతి వాహనం ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్ నెస్సర్టిఫికెట్ లను కలిగి ఉండేలా రవాణాశాఖ చర్యలు తీసుకోవాలని వెల్లడించింది.
